తిరుమల : కరోనా ప్రభావంతో రెండు సంవత్సరాల పాటు నిర్వహించనిసాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈసారి వైభవంగా జరిపేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లను ప్రారంభించారు. రెండు రోజుల క్రితం టీటీడీ అధికారులు పోలీసులతో నిర్వహించిన సమావేశం అనంతరం ఇవాళ రాయలసీమ రేంజ్ డీఐజీ రవిప్రకాశ్ ఆలయ మాడ వీధుల్లో పలు ప్రాంతాలను పరిశీలించారు.
దసరా పండుగ, సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు భక్తుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. రెండు సంవత్సరాల తర్వాత బ్రహ్మోత్సవాలను మాడ వీధుల్లో నిర్వహిస్తుండడం ఇదే ప్రథమమని వెల్లడించారు. గరుడ వాహన సేవ రోజునా ఐదు నుంచి ఆరు లక్షల మంది భక్తులు వచ్చే ఆవకాశం చెప్పారు.
టీటీడీ, పోలీసులు సూచనలు పాటిస్తే ఎలాంటి ఘటనలు చోటు చేసుకుండా ప్రశాంతంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.