విజయవాడ : టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు శుక్రవారం ఉదయం విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆమె దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పీవీ సింధుకు ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు ఆమెకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ.. ఒలింపిక్స్కు వెళ్లేముందు దుర్గమ్మను దర్శించుకున్నానని.. అమ్మవారి ఆశీస్సులతో పతకం గెలిచానన్నారు. దుర్గమ్మ దర్శనానికి రావడం సంతోషంగా ఉందని చెప్పారు. 2024 ఒలింపిక్స్ సహా భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్లు ఆడాల్సి ఉందని పీవీ సింధు పేర్కొన్నారు.