అమరావతి : తాము అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యల పరిష్కారానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, అదే జనసేన లక్ష్యమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. విజయవాడలో జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ జనవాణి ఉద్దేశాలను వెల్లడించారు. ప్రజల వద్దకు వెళ్లి సమస్యల సాధనకు చర్యలు తీసుకుంటేనే ప్రజా ప్రతినిధులకు గౌరవం ఉంటుందన్నారు.
అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని ఎదురు చూడడం లేదని అన్నారు. నేటి పాలకులకు ప్రజా సమస్యలు పట్టించుకునే తీరిక పాలకులకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆవేదన నుంచే పరిష్కారాలు పుట్టుకొస్తాయన్నారు. పార్టీ నేతల వద్దకు ప్రజలు రాకుండా ప్రజల వద్దకే పాలకులు వెళ్లాలనే సదుద్దేశంతో జనవాణిని ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.