అమరావతి : ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) మంగళవారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో వివిధ ప్రారంభోత్సవాలకు మోదీ హాజరు కానున్నారు. లేపాక్షి దుర్గాతో పాటు పాపనాశేశ్వర , వీరభద్ర స్వామి ఆలయాలను సందర్శించనున్నారు. పీఎం పర్యట సందర్భంగా ప్రధాని కార్యాలయ భద్రతాదికారులు , రాష్ట్ర పోలీసులు, అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ముఖ్యంగా భద్రత ఏర్పాట్ల రాష్ట్ర అధికారులకు పలు సూచనలు చేసింది. ప్రధాని పర్యటలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని సుమారు రూ. 541 కోట్ల వ్యయంతో జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ(నాసిన్)ను ప్రధాని ప్రారంభించనున్నారు.