అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఈనెల 17న ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారయ్యింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య పొత్తులు ఖరారు అయిన తరువాత తొలిసారిగా మోదీ ఏపీ(AP) లో పర్యటించనున్నట్లు్ ప్రధాని కార్యాలయం నుంచి చంద్రబాబు(Chandra babu) కు సమాచారాన్ని పంపింది.
ఈనెల 17న చిలకలూరిపేట లో జరిగే ఉమ్మడి బహిరంగ సభలో మోదీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ పాల్గొననున్నారు. చిలకలూరిపేట మండలం బొప్పూడిలో జరిగే సభకు లక్షలాధి సంఖ్యలో ప్రజలు హాజరయ్యేలా మూడు పార్టీలు ఈ పాటికే సన్నద్దమయ్యాయి. మంగళవారం టీడీపీ, బీజేపీలకు చెందిన నాయకులు సభాస్థలాన్ని పరిశీలించారు.
రేపు(బుధవారం) సభ వేదిక ఏర్పాట్లను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇక ప్రధాని ప్రత్యేక విమానంలో సభస్థలికి సమీపంలో జాతీయరహదారిపై రన్వేపై దిగే అవకాశాన్ని పరిశీలించారు. ప్రధాని విమానం దిగడంపై సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలించారు.