అమరావతి : ఏపీ మంత్రి రోజా (Minister Roja) పవన్కల్యాణ్పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన పొత్తుల్లో భాగంగా కేటాయించిన సీట్లపై ఈసారి విమర్శలు గుప్పించారు. శనివారం ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడారు.పవర్స్టార్.. పవర్లేని స్టారయ్యారని విమర్శించారు. కేవలం 24 సీట్లకు పరిమితం కావడం వెనుక ఎంత ప్యాకేజీ మాట్లాడుకున్నారోనని ఆరోపించారు.
175లో పావలా సీట్లు కూడా తీసుకోలేని పరిస్థితిలో పవన్కల్యాణ్( Pawan Kalyan) ఉన్నారని దొప్పి పొడిచారు. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయాలో తెలియని దుస్థితిని ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు. కుక్క బిస్కెట్లు వేస్తే తోక ఊపినట్లు సీట్లు తీసుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం పొత్తు అంటే ప్రజలు నవ్వుకుంటున్నారని చంద్రబాబు (Chandra Babu), పవన్ వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు.
రాష్ట్రం వీడిపోయి ఇన్ని రోజులు కావస్తున్నా రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను, కమీషన్లు కోసం పోలవరాన్ని, రియల్ ఎస్టేట్ కోసం అమరావతిని తాకట్టు పెట్టారని విమర్శించారు.