అమరావతి : పేదరికం పోవాలంటే ప్రతి ఒక్కరికి చదువు ఎంతో అవసరమని ఏపీ సీఎం జగన్ అన్నారు. నాణ్యమైన చదువుతోనే పేదరికం పోతుందని పేర్కొన్నారు. నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చామని తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమయ్యేలా బైజూస్ యాప్తో నాణ్యమైన విద్యను అందించేందుకు ఒప్పందం చేసుకున్నామని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం తీసుకొచ్చామని వివరించారు. పిల్లల భవిష్యత్పై దృష్టిపెట్టిన ఏకైక ప్రభుత్వం వైసీపీదని అన్నారు. జగనన్న గోరుముద్దతో స్కూళ్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే రోజుల్లో రూ. 12 వేల విలువైన ట్యాబ్ లు ప్రకటించారు. ఆధోని నగరంలో డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అకాడమిక్ క్యాలెండర్ను ఆవిష్కరించారు.