అమరావతి : వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళి( Posani Krishna murali) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి సినిమాలను బిజినెస్గా చూసినట్లే రాజకీయాలను బిజినెస్గా చూస్తారని , ఆయన రాజకీయాలకు(Political) పనికిరాడని విమర్శించారు.
ప్రజారాజ్యం పేరిట రాజకీయ పార్టీని పెట్టి 18 మంది ఎమ్మెల్యేలలో అసెంబ్లీ (Assembly) లో అడుగుపెట్టిన చిరంజీవి ఏనాడు ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలతో సమావేశాలను పెట్టలేదని విమర్శించారు. కొద్దిరోజులకే పార్టీని కాంగ్రెస్లో కలిపేసి రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా అయ్యాడని అన్నారు. రాజ్యసభ పదవి పూర్తికాగానే కాంగ్రెస్ ముఖం చూడడటం లేదని అన్నారు. కాపు సోదరులు ఎంతో మంది చిరంజీవిని నమ్ముకుని వెంట ఉంటే మోసం చేశారని ఆరోపించారు.
తమ్ముడు పవన్కల్యాణ్ (Pawan kalyan) కు ఓటేయ్యాలని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. చిరంజీవిని మంచి నాయకుడిగా చూడాలనే ఉద్దేశంతో తాను కూడా ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశానని తెలిపారు. అయితే రాజకీయలపట్ట చిత్తశుద్ధి, నిబద్ధత ఆయనలో లేవని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడిని మహానుభావుడని కొనియాడారు.