జైపూర్ : రరాబోయే కొన్నేండ్లలో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లకు గ్రామీణ ప్రాంతాల్లోనూ డిమాండ్ పెరుగుతుందని రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ అన్నారు, ఈ విభాగాల్లో గ్రామీణ యువతకు శిక్షణ ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. యువతకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన శిక్షణా సంస్ధలను ఎంపిక చేయాలని సూచించారు.
పలు నైపుణ్యాల్లో శిక్షణ ద్వారా యాచకులకు ఉపాధి సమకూర్చుతున్న అధికారులను సీఎం ప్రశంసించారు. నగరాల్లో యాచక వృత్తికి స్వస్తిపలికేలా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ పధకాన్ని అమలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. యాచకులు శిక్షణలో నైపుణ్యాలు పెంపొందించుకుని ఉపాధిని పొందేలా ఈ పధకాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని కోరారు.