అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ను (AP Budget) ప్రవేశపెట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను శాసనసభలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. రూ.3 లక్షల 22 వేల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ను సభ ముందుకు తీసుకొచ్చారు. ఇందులో వ్యవసాయానికి రూ.48 వేల కోట్లు కేటాయించారు. రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు, ద్రవ్యలోటు రూ.79,926 కోట్లుగా అంచనా వేశారు.