అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వేచ్ఛగా బతకడం కోసం మరో ఉద్యమం చేయక తప్పదని అన్నారు. టీడీపీ నాయకుడు సోమిరెడ్డి తెలిపారు. ఏపీలో వైసీపీ అరాచక పాలన కొనసాగిస్తుందని. ఏపీ విముక్తే లక్ష్యమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల ను సమర్ధించారు. ఏపీ ప్రజల మనోభావాలనే పవన్ కల్యాణ్ వ్యక్తపరుస్తున్నాడని అన్నారు.
ప్రజా శ్రేయస్సు దృష్ట్యా వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకూడదన్న పవన్ వ్యాఖ్యలు వాస్తవమే నని వివరించారు. వైసీపీ నాయకులు జైళ్లకు పోక తప్పదనే భయంతోనే విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పవన్ లేవనెత్తిన అంశాలకు మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని తెలిపారు.