అమరావతి : ఏపీలో త్వరలో జరుగబోయే ఎన్నికల్లో పొత్తుల(Alliances) పై త్వరలోనే స్పష్టత వస్తుందని, అప్పటి వరకు జనసేన (Janasena) కార్యకర్తలు పార్టీ విధానాలకు భిన్నంగా మాట్లాడవద్దని పవన్కల్యాణ్ ( Pawan Kalyan) సూచించారు. జనహితం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి జనసేన ప్రథమ ప్రాధాన్యమని ఆయన మరోసారి గుర్తుచేశారు. త్వరలో పొత్తులపై స్పష్టం వస్తుందని ఆయన వెల్లడించారు.
ప్రజలు స్థిరత్వాన్ని కాంక్షిస్తున్నారని, ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే పొత్తు ను చేసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. పొత్తులపై భిన్నంగా వ్యాఖ్యలు చేసేవారి నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు. పొత్తులపై సందేహాలుంటే నా రాజకీయ కార్యదర్శి దృష్టికి తీసుకురావాలని కోరారు.