అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్పై ఏపీ మంత్రి జోగి రమేశ్(Jogi Ramesh) విరుచుకుపడ్డారు. ఏపీ ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తులు కలుపుకోవడాన్ని తప్పుపడుతూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో ఎక్కడ పోటీచేస్తాడో తెలియని పవన్ (Pawankalyan) అసెంబ్లీ గేటుకూడా దాటలేదని వ్యాఖ్యనించారు. ఎన్నికల తరువాత టీడీపీ, జనసేన, బీజేపీలను ప్రజలు కృష్ణానదిలో కలిపేయడం ఖాయమని ఆరోపించారు.
యుద్ధంలో పోటీచేయమంటే అస్త్ర సన్యాసం చేసిన వ్యక్తి పవన్ ముఖ్యమంత్రి అవుతానని పార్టీ పెట్టి సీట్లకు లొంగిపోయాడని విమర్శించారు. 2014లోనూ మూడు పార్టీలు ఏకమై వచ్చి ఆ తరువాత కొద్ది నెలలకు వీడిపోయారని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లోనూ కూటమికి ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. చంద్రబాబు కుప్పంలో, లోకేష్ మంగళగిరిలో ఓడిపోతారని వెల్లడించారు. 175 స్థానాల్లో వైసీపీ జెండ ఎగురవేయడం ఖామని ధీమాను వ్యక్తం చేశారు.