అమరావతి : దశాబ్దకాలం పాటు తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్ నవ్వుల ద్వారా దగ్గరయ్యాయని ఇక రాజకీయాల్లో నవ్వులు పూయిస్తానని ఏపీ టూరిజం శాఖ మంత్రి రోజా తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లా ఇడుపుల పాయలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనేక మంది తనను ఇక జబర్దస్లో పనిచేయారా అని అడుతున్నారని తెలిపారు. పది మందికి ఉపయోగంకోసం ఒకటి వదులుకోక తప్పదని ఆమె చెప్పారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ పునర్వ్యివస్థీకరణలో మంత్రిగా చోటు దక్కించుకున్న రోజా పలు జిల్లాలో పర్యటిస్తున్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి రెండుసార్లు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అటు ప్రజాప్రతినిధిగా కొనసాగుతూనే జబర్దస్త్ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ముందుకు నడిపించారు. 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ తొలి కేబినెట్లో స్థానం దక్కుతుందన్న ఆమెకు నిరాశే ఎదురైంది. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజుల్లోనే రెండున్నర సంవత్సరాల తరువాత నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తానని చేసిన ప్రకటన మేరకు మంత్రులందరి చేత రాజీనామా చేయించి అందులో 11 మంది పాతవారిని, 14 మందిని కొత్తవారిని కొత్త మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
అయితే ఈనెల 10 న మధ్యాహ్నం వరకు మంత్రుల జాబితాలో రోజా పేరు లేకపోవడంతో ఆమె నిరాశగా హైదరాబాద్ లోనే ఉండిపోయారు. అనూహ్యంగా ఆమె పేరు తెరపైకి రావడంతో ఆమె సంతోషాన్ని పట్టపగ్గాలు లేకుండాపోయాయి. మంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందే ఆమె జబర్దస్త్కు గుడ్బై చెప్పారు .