తిరుమల: తిరుపతికి చెందిన ఉదయ కుమార్ రెడ్డి అనే భక్తుడు శనివారం ఉదయం టీటీడీకి రూ.17 లక్షలు విలువైన ఎంజీ ఆస్టర్ కారును విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయం ఎదుట కొత్త వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దాత ఉదయ్ కుమార్ రెడ్డి కారు తాళాలను ఆలయ డిప్యూటీ ఈఓ రమేష్కు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీవారికి కారును విరాళంగా ఇచ్చిన ఉదయ్ కుమార్రెడ్డికి ఆలయ పూజారులు స్వామి వారి ప్రసాదాలు అందించి ఆశీర్వచనం ఇచ్చారు.
అప్పలాయగుంటలో..
అటు, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి తిరుపతికి చెందిన రవికుమార్ అనే భక్తుడు శనివారం రూ.39 వేల విలువైన ఫ్లవర్ స్టోరేజ్ బహూకరించారు. ఈ మేరకు ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి బాయికి ఫ్రిడ్జ్ను అందించారు. ఈ ఫ్రిడ్జ్లో స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలకు వినియోగించే పుష్పాలను నిల్వ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో ఆలయం ఇన్స్పెక్టర్ శివ కుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.