అమరావతి : సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ఎన్టీఆర్కు జూనియర్ ఎన్టీఆరే (Junior NTR) వారసుడని లక్ష్మీపార్వతి(Laxmiparvathi) వెల్లడించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆమె మాట్లాడారు. తాత పేరును జూనియర్ ఎన్టీఆర్ నిలబెడుతున్నాడని ప్రశంసించారు. గత ఎన్నికల్లో జూ.ఎన్టీఆర్ను వాడుకుని వదిలేశారని చంద్రబాబు (Chandra Babu) పై విమర్శలు చేశారు.
‘ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 29 ఏళ్లు అయ్యిందని’ వెన్నుపోటు పొడవడమే కాదు చెప్పులేసి అవమానించార’ని ఆరోపించారు. కుటుంబమంతా ఎన్టీఆర్ను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లే మళ్లీ ఎన్టీఆర్కు దండలు వేస్తున్నారని దుయ్యబట్టారు. యుగ పురుషుడంటూ భజనలు చేస్తున్నారని , ఆయన ఆత్మకు క్షోభ కలిగిస్తున్నారని, తనను బూచిగా చూపి మహనీయుడు ఎన్టీఆర్ నుంచి పదవిని లాక్కున్నారని విమర్శించారు.