కర్నూలు: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కేంద్రంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. శనివారం తెల్లవారుజామున కర్నూలులోని శ్రీలక్ష్మీనగర్లో ఉంటున్న విరసం నేత పినాకపాణి (Pinakapani) ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీ చేశారు. ఫిబ్రవరిలో కేరళలోని కొచ్చిలో పినాకాపానిపై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఈనేపథ్యంలో ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. అనంతరం విచారణ నిమిత్తం కర్నూలు త్రీ టౌన్ పోలీస్స్టేషన్కు రావాలని అధికారులు తెలిపారు.
కాగా, గతంలో కూడా పినాకపాణిని ఎన్ఐఏ విచారించిన విషయం తెలిసిందే. గతేడాది పినాకపాణి ఇంట్లో ఎన్ఏఐ అధికారులు సోదాలు చేపట్టారు. ఇంట్లో ఉన్న కొన్ని పుస్తకాలు, పెన్డ్రైవ్, హార్డ్ డిస్క్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.