అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,287 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 2,430 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,68,462కు పెరిగాయి. ఇవాళ్టివరకు మొత్తం 19,34,048 మంది కోలుకున్నారు. మరో 21,019 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 13,395కు చేరాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 85,856 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.