అమరావతి : మాజీ పార్లమెంట్ సభ్యుడు విజయసాయి రెడ్డి ( Vijayasai Reddy ) సంచలన ప్రకటన చేశారు. ఏపీలో రెండు ప్రధాన పార్టీలపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త రాజకీయ పార్టీ ( New Political Party ) ఏర్పాటు కానున్నదని వెల్లడించారు. దసరాకు తన పార్టీని జెండాను , ఏజెండాను ప్రకటిస్తానని తెలిపారు.
త్వరలో తాను రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నయంగా రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు తెలిపారు. సోమవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించు కున్నారు. అనంతరం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వం, ప్రతిపక్ష వైసీపీని తీవ్రంగా విమర్శించారు.
ప్రస్తుతం ఏపీలో టీడీపీ రెడ్బుక్ ( Red Book) పాలన కొనసాగిస్తుండగా, ప్రతిపక్ష పార్టీ వైసీపీ రప్పా రప్పా పార్టీలను నడిపిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ , వైసీపీ పార్టీలు రాష్ట్రానికి చేసిందేమి లేదని దుయ్యబట్టారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తాను సీఎంను కానని, కేవలం సలహాలు మాత్రమే ఇస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని రెండు రాజకీయ పార్టీలే పాలించాలా, రెడ్డు, కమ్మలే సీఎంలు కావాలా అని ప్రశ్నించారు.