తిరుపతి : శ్రీనివాసమంగాపురంలో కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడో రోజైన శనివారం రాత్రి స్వామివారు వెన్న కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై కటాక్షించారు. కార్యక్రమంలో డీఎల్ఓ రెడ్డప్ప రెడ్డి ఆలయ డెప్యూటీ ఈవో శాంతి, ఏఈవో గురుమూర్తి, సూపరింటెండెంట్లు చెంగల్రాయలు, రమణయ్య, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు పాల్గొన్నారు.