విశాఖపట్నం: భూ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే మధ్య స్థాయి ఎంఆర్ఎస్ఏఎం క్షిపణిని మంగళవారం భారత నేవీ విజయవంతంగా ప్రయోగించింది. ఐఎన్ఎస్ విశాఖపట్నం నుంచి ఈ ప్రయోగం జరిగింది.
డీఆర్డీవో, ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా ఈ క్షిపణిని అభివృద్ధి చేయగా బీడీఎల్ ఉత్పత్తి చేసింది. ఇది శత్రువుల క్షిపణులు, ఎయిర్క్రాఫ్ట్లు, గైడెడ్ బాంబులు, హెలికాప్టర్లను ఆకాశంలోనే కూల్చివేయగలదు.