అమరావతి : ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన కేసులో ప్రముఖ సినీ నటుడు ఎం. మోహన్బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. తిరుపతి కోర్టులో జరుగుతున్న విచారణను ఎనిమిది వారాలపాటు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2019 మార్చి 22న అప్పటి టీడీపీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదని మోహన్బాబు కుటుంబం తిరుపతి -మదనపల్లె జాతీయ రహదారిపై ధర్నా చేశారు.
అప్పటికే సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో మోహన్ బాబు, ఆయన కుమారులు విష్ణు, మనోజ్, శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల ఏవో తులసి నాయుడు, పీఆర్వో పై కేసు నమోదైంది. కోడ్ ఉల్లంఘించి రోడ్డుపైకి వచ్చిన వాహనదారకులకు ఆటంకం కలిగించారని , పోలీసుల అనుమతి తీసుకోలేదని చంద్రగిరి పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.
ఈ కేసుపై ఈ ఏడాది జూన్ 28న కోర్టుకు వీరంతా హాజరుకాగా సెప్టెంబర్ 30 వ తేదీకి వాయిదా వేసింది. దీనిపై మోహన్బాబు హైకోర్టులో పిటిసన్ దాఖలు చేయగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.