అమరావతి : డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో నిందితుడికి ఉన్న కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబు ఇవాళ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలులో సరెండర్ అయ్యారు. గత మూడు నెలలుగా అనంత బాబు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ మంజూరు చేయాలని పలుమార్లు పిటిషన్ దాఖలు చేసినప్పటికి రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ హైకోర్టు పిటిషన్ను నిరాకరించింది.
తల్లి మృతి చెందడంతో అంత్యక్రియల కోసం అనంతబాబుకు కోర్టు 14 రోజుల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. బెయిల్ గడువు ముగియడంతో ఇవాళ రాజమండ్రి జైల్లో సరెండర్ అయ్యారు.