అమరావతి : ఏపీ టూరిజం శాఖ మంత్రి రోజా (Minister Roja) సెల్వమణి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై విరుచుకు పడ్డారు. చంద్రబాబు (Chandra Babu) డైరెక్షన్లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పనిచేస్తున్నాడని ఆరోపించారు. బాబు రాసిచ్చిన స్క్రిప్ట్ను చదువుతున్నాడని ఎద్దేవా చేశారు.
పవన్ ఎవరి మాట వినడు కాబట్టే అతడిని భార్యలు ( Wifes ) వదిలేశారని ఆరోపించారు. పవన్కు చంద్రబాబు పూనిన చంద్రముఖి ( Chandramukhi) ఆవహించిందని విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఏపీ ప్రజలకు జరిగిన మోసాలపై నాడు పవన్కల్యాణ్ స్పందించలేదని ప్రశ్నించారు. జన్మభూమి కమిటీల పేరుతో అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. కేంద్రం అనేక రకాలుగా లబ్ధిదారుల డేటా తీసుకుంటే అక్రమ రవాణా చేస్తున్నారని మోదీని నిలదీయగలవా అంటూ రోజా నిలదీశారు.