అమరావతి : ఏపీ మంత్రి రోజా(AP Minister Roja) సెల్వమణి మరోసారి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల (PCC chief Sharmila) పై విమర్షలు ఎక్కుపెట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆత్మ క్షోభించే విధంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. తిరుమల(Tirumala) లో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
వైఎస్సార్ కుటుంబం మాట ఇస్తే నిలబడతారు అనే నమ్మకం వైఎస్ జగన్ (YS Jagan) పాలనను చూస్తే అర్థమవుతుందని అన్నారు. షర్మిల అందుకు భిన్నంగా ప్రవర్తిస్తుందని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం, జగన్ పాలనను చంద్రబాబు ఇచ్చిన స్రిప్టు (Chandra Babu Script) తో విమర్శలు చేస్తుందని పేర్కొన్నారు. కుటుంబాలను చీల్చడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఆమె అన్నారు.
మూడుసార్లు ముఖ్యమంత్రి గా పనిచేసిన చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల మళ్లీ అవకాశమివ్వండి అంటూ అడుక్కోవడం సిగ్గుచేటని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొందని అన్నారు. వైసీపీ నుంచి వెళ్లగొట్టిన నాయకులనే అభ్యర్థులుగా పెట్టుకునే స్థితికి దిగజారారని విమర్శించారు.