ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15 తర్వాత ఏపీలో ఊహించని పరిణామాలు రాబోతున్నాయని వెల్లడించారు. ఏం జరగబోతోంది? అన్న విషయాన్ని మీరే చూడబోతున్నారంటూ పజిల్ పెట్టారు. తమ ప్రభుత్వం ఏదైనా అనుకుంటే.. దానిని చేసి తీరుతుందని స్పష్టం చేశారు.
మూడు రాజధానుల్లో భాగంగా.. కర్నూలుకు జ్యూడీషియల్ కేపిటల్ వచ్చేసిందన్నారు. అయితే ఈ విషయాన్ని ఇప్పుడు అధికారికంగా చెప్పకూడదని, కానీ చెప్పేస్తున్నానని మంత్రి వెల్లడించారు. ఏపీ టౌన్ప్లానింగ్లో విపరీతమైన అవినీతి వుందని, ఏసీబీ కేసుల ఫైల్స్ చూస్తే, ఈ కేసులే ఎక్కువ అని వెల్లడించారు.
గత ప్రభుత్వం అమరావతి చుట్టూ గ్రాఫిక్స్ చేసిందని, అమరావతి చుట్టూ ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడిందని మంత్రి ఆరోపించారు. అందుకే వికేంద్రీకరణ పేరుతో తాము అన్ని ప్రాంతాలకు సమ న్యాయం చేయడానికి నడుం కట్టామని పేర్కొన్నారు.