అమరావతి : ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తన ప్రేమను నిరాకరించిదనే కసితో మైనర్ బాలికను కారుతో ఢీకొట్టి తీవ్రగాయాలపాలు చేసి పారిపోయిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. కల్యాణదుర్గానికి చెందిన ఇంటర్ చదువుతున్న విద్యార్థిని భాస్కర్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఆమె నిరాకరిస్తుండడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఆమెను కారుతో ఢీకొట్టాడు. ఈ ఘటనను నిందితుడు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేశాడు.
గాయపడ్డ బాలికను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా ఆమెను పరీక్షించిన వైద్యులు సర్జరీలు చేసి ప్రాణాపాయం నుంచి తప్పించారు. మరో రెండు సర్జరీలు చేయవలసి ఉందని వైద్యులు పేర్కొన్నారు. నిందితుడు భాస్కర్తో పాటు మరో ఇద్దరు తమ కుమార్తెను కారులో కిడ్నాప్ చేశారని , ప్రేమించాలని బలవంతం చేశారని బాధితురాలి తల్లి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
వరుసకు సోదరుడయ్యే భాస్కర్ ప్రేమను నిరాకరించిందుకే కుమార్తెను కారుతో ఢీ కొట్టి చంపాలని యత్నించాడని ఆమె వివరించారు. తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి ద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.