తిరుమల : క్రోధినామ సంవత్సర పంచాంగాన్ని టీటీడీ (TTD) మంగళవారం నుండి భక్తులకు అందుబాటులో ఉంచింది. ప్రతి ఏటా మాదిరిగానే రాబోయే నూతన తెలుగు సంవత్సరాది క్రోధినామ (Krodhinama) సంవత్సర పంచాగాన్ని టీటీడీ ముద్రించింది. తిరుమల (Tirumala) , తిరుపతిలలోని టీటీడీ పుస్తక విక్రయ కేంద్రాలలో రూ.75 చెల్లించి భక్తులు వీటిని కొనుగోలు చేయవచ్చని సూచించింది. మిగిలిన ప్రాంతాల్లో త్వరలో టీటీడీ అందుబాటు లోనికి తీసుకురానుందని వెల్లడించింది .
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 68,563 మంది భక్తులు దర్శించుకోగా 21,956 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi Income) రూ. 4.91 కోట్లు వచ్చిందని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బుధవారం 10 కంపార్టుమెంట్లలో వేచియుండగా టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని వివరించారు.