తిరుపతి : తిరుపతి(Tirupati) లోని కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఈనెల 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam) జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో మార్చి 1 నుంచి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుందని ఆలయ అధికారులు వివరించారు.
ఆలయం మొత్తాన్ని, పూజా సామగ్రిని శుద్ధిచేసి సుగంధ ద్రవ్యాలతో ప్రోక్షణం చేస్తారని, ఈ కారణంగా ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సర్వదర్శనం ఉంటుందని వెల్లడించారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల(Tirumala ) దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో 13 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 69,191 మంది భక్తులు దర్శించుకోగా 22,295 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న ఒక్క రోజే కానుకల ద్వారా హుండీకి రూ.3.60 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.