అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు బుధవారం ఉదయం మిథున లగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్టించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ నిర్వహించారు.
ధ్వజస్తంభానికి నవకలశ పంచామృతాభిషేకం చేసి సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.
ఆలయ ప్రధాన కంకణబట్టర్ రాజేష్ కుమార్ భట్టర్ ఆధ్వర్యంలో ధ్వజారోహణం కార్యక్రమం జరిగింది.
రాజంపేట ఎమ్మెల్యే, టీడీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు మేడా మల్లికార్జునరెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 26న స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
కల్యాణోత్సవంలో ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నట్లు తెలిసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి