అమరావతి : ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేన పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ నడుపుతున్నది కాపు జనసేన పార్టీ కాదని కమ్మ జనసేన పార్టీ అని ఎద్దేవా చేశారు. ఇవాళ మీడియా సమావేశం లో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కల్యాణ్ రెండు నాల్కల దోరణి వ్యవహరిస్తుండడం తో కాపులు ఆయనకు ఓట్లు వేయడం లేదని ఆరోపించారు.
టీడీపీ నాయకులు కొందరు దురుద్ధేశంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిని లాగుతున్నారని ఏపీ మంత్రి మండిపడ్డారు. మరోసారి భారతి గురించి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించా రు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడా రు. టీడీపీ నాయకుడు నారా లోకేశ్కు బ్రాహ్మణితో ఏదైనా ఉంటే ఇంట్లో తేల్చుకోవాలని హితవు పలికారు. రాజకీయాల్లో ఉన్న వారిపై ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజ మని, అయితే ఏనాడు రాజకీయాల్లోకి రాని భారతి గురించి విమర్షలు చేయడం మానుకోవాలని సూచించారు.