అమరావతి : ఆంధ్రప్రదేశ్ టూరిజం, క్రీడల శాఖ మంత్రి రోజా(Minister Roja) పై ఆమె అనుచరులు మండిపడుతున్నారు. ఆమెకు టికెట్ ఇవ్వొద్దని వైసీపీ(YCP) అధిష్టానానికి మంగళవారం విజ్ఞప్తి చేశారు. నగరి నియోజకవర్గానికి చెందిన ఐదు మండలాల వ్యతిరేక వర్గం నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించి నియోజకవర్గంలో రోజాకుకాకుండా మరెవరికైనా టికెట్(Ticket) ఇవ్వాలని కోరారు.
రెండు సార్లు పార్టీ, అభ్యర్థి రోజాను గెలిపించుకునేందుకు అహర్శిశలు, శక్తివంచన లేకుండా పనిచేశామని తెలిపారు. ఐరన్ లెగ్(Iron leg) పేరున్న రోజాను నియోజకవర్గ వైసీపీ నాయకులంతా గోల్డెన్ లెగ్ గా మార్చామని పేర్కొన్నారు. అయితే నియోజకవర్గంలో ఆమె సోదరులు చేస్తున్న దోపిడికి(Looting) అడ్డుగా ఉన్నామనే అక్కసుతో మమ్మల్ని దూరంగా పెట్టి వేధిస్తున్నారని వడమాలపేట జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, పుత్తూరు నేత అమ్ములు, లక్ష్మీపతిరాజు, మండలాల వైసీపీ నాయకులు ఆరోపించారు.
వ్యతిరేకవర్గం నేతలు ఎవరైనా సరే అవినీతి పాల్పడి ఉంటే దానిపై రోజాతో చర్చకు సిద్దమని సవాల్ విసిరారు. వైసీపీ అధికారంలోకి రాకముందు అప్పుల్లో ఉన్న రోజా మంత్రి అయ్యాక ఎంత సంపాదించిందో అందరికీ తెలుసని విమర్శించారు. పుత్తూరు( Puttoor) నగరిలో ఎక్కడ చూసినా భూ కబ్జాలు, దౌర్జన్యాలు, దోపిడీలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మంత్రి రోజాకు మరోసారి వైఎస్ఆర్ అధిష్టానం సీటు ఇస్తే తాము పనిచేయాబోమని స్పష్టం చేశారు.