అమరావతి : నేటి యువత స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని ముందుకుసాగితే విజయాలు సొంతమవుతాయని ఏపీ మంత్రి రోజా అన్నారు. లక్ష్యసాధనలో వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని ఆమె సూచించారు. చిత్తూరు జిల్లా పుత్తూరు ఎస్.ఆర్.ఎస్ ప్రభుత్వ కళాశాలలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు.
యువతను సన్మార్గంలో నడవడానికి స్వామిజీ చేసిన బోధనలు యువత పాటించాలని కోరారు. లక్ష్యసాధనలో యువత విఫలమైతే లక్ష్యం సాధించేవరకు ప్రయత్నిస్తూనే ఉండాలని సూచించారు. ఆదర్శవంతమైన సమాజం ఏర్పాటుకు యువత నడుము కట్టాలని పిలుపునిచ్చారు.