అమరావతి : ఏపీలో నీట్ శిక్షణ పొందుతున్న హైదరాబాద్ యువతి బలవన్మరణం చెందింది. హైదరాబాద్ బేగంపేటకు చెందిన కంతేటి వైష్ణవి(19) కృష్ణా జిల్లా కానూరులోని శ్రీ భారతి ఇన్స్టిట్యూట్ లాంగ్టర్మ్ కోచింగ్ సెంటర్లో మూడు వారాల కిందట నీట్ శిక్షణ కోసం చేరింది. ఇన్స్టిట్యూట్ హాస్టల్లోనే ఉంటూ ఇటీవల ఇంటికి వెళ్లి రెండ్రోజుల తర్వాత తిరిగి వచ్చి, ఇంత దూరంలో ఉంటూ చదవలేననీ తనను ఇంటికి తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు వైష్ణవి ఫోన్ చేసినట్లు సమాచారం.
వారు ఆమెకు నచ్చజెప్పగా, ఈనెల 4న తనకు ఆరోగ్యం బాగోలేదని కాలేజీకి వెళ్లకుండా హాస్టల్ రూంలో ఫ్యానుకు ఉరేసుకొని వైష్ణవి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.