అమరావతి : విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదం ( Visakha Plant Accident) పై జాతీయ మానవ హక్కుల సంఘం ( Human Rights Commission ) స్పందించింది. మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన కమిషన్ విశాఖ ప్రమాదంలో 9 మంది మృతి చెందడంపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ సీఎస్కు ఆదేశాలు జారీ చేసింది.
సోమవారం ప్లాంట్లో ల్యాడిల్ నుంచి ఉక్కుద్రవం పేలి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. స్టీల్ ప్లాంట్లో తరుచూ ప్రమాదాలపై ఉద్యోగ, కార్మిక సంఘాల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది.