తిరుమల : తిరుమలలో పోలీసులు భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. తిరుమల నుంచి తిరుపతి వచ్చే మార్గంలో గాలి గోపురం వద్ద అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న 11 మంది స్మగర్లను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 85 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. కోటి వరకు ఉండవచ్చని పోలీసులు తెలిపారు.
ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న అటవి ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుందని పోలీసులకు అందిన సమాచారం మేరకు గత మే నెలలో అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ పెరుమాళ్తో పాటు మరో నిందితుడిని పట్టుకున్నారు. వీరి వద్ద రూ.3 కోట్ల విలువైన 100 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, నాలుగు వాహనాలను సీజ్ చేశారు.