Appsc Group -1 | 2018లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష (TSPSC Group 1 Prelims)ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. 2018లో ఏపీపీఎస్సీ ఈ పరీక్ష నిర్వహించగా.. తాజాగా ఈ పరీక్షను హైకోర్టు రద్దుచేసింది. మరోసారి ఈ పరీక్షను నిర్వహించాలని ఆదేశించింది. మెయిన్స్ జవాబు పత్రాలను పలుసార్లు వాల్యూయేషన్ చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా మెయిన్స్లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసిన న్యాయస్థానం.. మళ్లీ పరీక్ష నిర్వహణ, ఎంపిక 6 వారాల్లో పూర్తి చేయాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది.