తిరుపతి : చెన్నైలో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం శాస్త్రోక్తంగా మహాకుంభాభిషేకం(Kumbhabhishekam) జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 4 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విశ్వక్సేనారాధన, చతుష్టార్చన, బలిహరణ, గోష్టి, బ్రహ్మఘోష, వేదశాత్తుమొర, మహా పూర్ణాహుతి, ప్రాయశ్చిత్త హోమాలు, శాంతిహోమాలు, పూర్ణాహుతిని నిర్వహించారు.
ఆలయ నిర్మాణానికి స్థలం విరాళంగా ఇచ్చిన సినీనటి కాంచన,వారి కుటుంబ సభ్యులు అదృష్టవంతులని పేర్కొన్నారు. దేశంలోని జ్యోతిర్లింగాలు,అష్టాదశ శక్తి పీఠాల్లో కెల్లా తిరుమల శ్రీవారు గొప్ప దేవుడని కొనియాడారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి(Ttd Chairman)టీటీడీ స్థానిక సలహామండలి అధ్యక్ష్యులు శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.