అమరావతి : సాధారణ పామును చూస్తేనే గుండె జల్లుమనడం ఖాయం. అదే భయంకరమైన, అతి విషపూరిత పాము కనిపిస్తే పై ప్రాణాలు పైనే పోవాల్సిందే. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో రెండు సార్లు గిరినాగు అనే పాము కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రపంచంలోనే విషపూరితమైన పాముగా పేరున్న 15 అడుగులున్న గిరినాగు అనే పాము పొలంలో పనిచేస్తున్న రైతు కంటపడడంతో ఉరుకులు, పరుగులతో వెళ్లి అతడు గ్రామస్థులకు వివరించారు.
దీంతో వారు ఈస్ట్రన్ గార్డ్ వైల్డ్ లైఫ్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సొసైటీ సభ్యులు కొన్ని గంటల పాటు శ్రమించి విషపు పామును పట్టుకుని అటవీప్రాంతంలో వదిలివేశారు. రెండ్రో జుల కిందట ఇదే మండలం లక్ష్మీపేటలో 12 అడుగుల గిరినాగును అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు.