అమరావతి : ఏలూరు జిల్లా (Eluru)ముదినేపల్లి మండలం పెనుమల్లిలో గ్యాస్ పైపులైన్ లీకవడంతో(Gas pipeline Leak) భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రధాన రహదారి వెంబడి గ్యాస్ పైపులైన్ లీకవడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాల రాకపోలను నిలిపివేశారు. కైకలూరు అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.