అమరావతి : కడప జిల్లా జైలులో ఎర్రచంద్రనం స్మగ్లర్లకు (Redsandal Smugglers ) సెల్ఫోన్ల అందజేసిన కేసులో ఐదుగురు జైలు అధికారులు, సిబ్బంది సస్పెన్షన్కు (Suspension) గురయ్యారు. సెల్ఫోన్ల ఆరోపణలపై ఫిర్యాదులు రావడంతో డీఐజీ రవికిరణ్ కడపై జైల్లో నాలుగురోజుల పాటు విచారణ జరిపి ఉన్నతాధికారులకు ప్రాథమిక నివేదికను అందజేశారు.
ఈ నివేదిక ప్రకారం జైలర్ అప్పారావు, డిప్యూటీ సూరింటెండెంట్ కమలాకర్తో పాటు మరో ముగ్గురు జైలు వార్డర్లను సస్పెన్షన్ చేస్తూ జైళ్లశాఖ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు. జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న స్మగ్లర్లకు సెల్ఫోన్లు అందిస్తున్నారని అభియోగాలు ఉన్నాయి.