అమరావతి : ఏపీలోని అనకాపల్లి వైసీపీకి సీనియర్ మాజీ మంత్రి దాడి వీరభద్రరావు (Dadi Veerabhadra Rao) పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా(Resigns) లేఖను వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్కు, పార్టీ నాయకులు సజ్జల రామకృష్ణ రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డికి పంపించారు.
రాజీనామాకు ముందు పార్టీ నాయకులతో సమావేశమై అనుచరులతో కలిసి రాజీనామా చేస్తూ ఏకవ్యాక్యంతో లేఖను అధిష్టానానికి పంపించారు. టీడీపీ(TDP) నుంచి వైసీపీకి వచ్చిన దాడి వీరభద్రరావు వైసీపీలో తనకు సముచిత ప్రాదాన్యం ఇవ్వడం లేదని, తనకుగాని, తన కుమారుడికి గాని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) టికెట్ ఇచ్చే అవకాశాలు లేకపోవడంతో అనుచరులతో కలిసి రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే ఏ పార్టీలో చేరాలన్నది రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది.