అమరావతి : ప్రముఖ తెలుగు యాంకర్ సుమ కనకాల (Suma Kanakala ) దంపతులు మంగళవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. భర్త రాజీవ్ కనకాల, కుమారుడు, సినీ హీరో, కుమార్తె స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా మళయాల నటుడు మోహన్లాల్ ( Mohanlal ) , ముకేశ్ రిషి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను . అందజేశారు.