AP news | పాఠశాలక వెళ్తూ వాగు దాటే క్రమంలో వరద ఉధృతికి ఓ టీచర్ కొట్టుకుపోయింది. ఈ సంఘటన ఏపీలోని కర్లపొద గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎం.మణి కర్లపొద ప్రభుత్వ ప్రాథమిక పాఠాశాలలో టీచర్గా పని చేస్తున్నారు. ఎప్పటిలాగే సోమవారం పాఠశాలకు వెళ్తుండగా వాగు దాటే క్రమంలో వరద ప్రవాహానికి కొంతదూరం కొట్టుకుపోయారు.
కొంతదూరం వెళ్లాక ఓ చెట్టు కొమ్మను పట్టుకొని రక్షించమని కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వెంటనే ఆమెను కాపాడి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా వాగుపై బ్రిడ్జిని నిర్మించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు.