అమరావతి : ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో చంద్రబాబు ప్రభుత్వం ( Chandrababus Government ) ఉద్యోగుల సమస్యల పట్ల అవలంభిస్తున్న వైఖరిని నిరిసిస్తూ ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు వినూత్న తరహాలో నిరసన తెలిపారు.
ఇచ్చిన హామీలు రెండేళ్లు దాటిపోవస్తున్నా ఇంతవరకు నేరవేర్చలేదని, ఉద్యోగులకు బోడిగుండు ( Shave Heads ) ను చూపిస్తున్నారని ఆరోపిస్తూ విజయవాడ నగరంలో ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి గుండు చేయించుకుని చంద్రన్న బోడిగుండు పేరుతో నిరసన తెలిపారు.
పీఆర్సీ, డీఏలు, ఐఆర్, ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి నెలా రూ.1500 కోట్ల మేర ఉద్యోగులకు రాఆల్సిన ప్రయోజనాలు నిలిపివేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఫెడరేషన్ నాయకులు వెల్లడించారు.