హైదరాబాద్: అమెరికాలో తెలుగు యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అగ్రరాజ్యంలోని (USA) ఓహియోలో (Ohio) దుండగులు జరిపిన కాల్పుల్లో (Shot dead) ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు (Eluru) అశోక్నగర్కు చెందిన వీరా సాయేశ్ (Veera Saiesh) మృతిచెందాడు. ఎమ్మెస్ (MS) చేయడానికి అమెరికా వెళ్లిన సాయేశ్.. కొలంబస్ (Columbus) ఫ్రాంక్లింటన్లోని ఓ షెల్ గ్యాస్ స్టేషన్లో (Shell gas station) పార్ట్టై ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 12.50 గంటలకు (భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం) గ్యాస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుండగా ఇద్దరు దుండగులు అతనిపై కాల్పులు జరిపి నగదు ఎత్తుకెళ్లారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సాయేశ్ను ఓహియోహెల్త్ గ్రాండ్ మెడికల్ సెంటర్కు తరలించారు. అయితే అక్కడి చికిత్స పొందుతు మరణించాడు.
తండ్రి మరణం అనంతరం 2021లో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన సాయేశ్.. ఓహియో స్టేట్ పిన్స్ యూనివర్సిటీలో ఎమ్మెస్ చదువుతున్నాడు. ఇప్పుడిప్పుడే కుటుంబానికి అండగా నిలుస్తున్న ఆయన ప్రస్తుతం చివరి సెమిస్టర్లో ఉన్నాడు. మరో పది రోజుల్లో ఎమ్మెస్ పూర్తికానుంది. ఈనేపథ్యంలో ఇంటికి తిరిగి రావడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే అతడు మృతిచెండటంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది.