అమరావతి : ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని గోరంట్ల మండలం వానవోలులో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. గ్రామానికి చెందిన వాల్మీకి పాపన్న, వెంకటలక్ష్మమ్మ అనే దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వయోభారంతో ఇబ్బందులు పడుతున్న దంపతులు ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని, శవ పంచనామా నిర్వహించి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.