అమరావతి: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పర్యటించారు. ఇండోర్ స్టేడియం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఏపీ సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉండేందుకేనని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్కు గతంలో జరిగిన అన్యాయం మరోసారి జరుగకుండా ఏపీలోని కోస్తా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధి, అధికార వికేంద్రీకరణ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేందుకు చెందడానికి మూడు రాజధానుల నిర్ణయమని పేర్కొన్నారు.