ఢిల్లీ : దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులను తలచుకుంటూ, వారు చేసిన పోరాటాలను, త్యాగాలను స్మరించుకునే ఉద్దేశ్యంతో విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించాల్సిందిగా కళాళాలలను, విశ్వవిద్యాలయాలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కోరింది. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృతోత్సవ్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా సూచించింది.
స్వాతంత్ర్య సమరయోధులపై రాసేందుకు విద్యార్థులను ప్రోత్సహించాల్సిందిగా యూజీసీ పేర్కొంది. ఈ చర్య విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందిస్తుందని తెలిపింది. కాలేజీలు, యూనివర్సిటీలు నిర్వహించిన కార్యక్రమాలను యూనివర్సిటీ యాక్టివిటీ మానిటరింగ్ పోర్టల్(యూఏఎంపీ)లో అప్లోడ్ చేయాల్సిందిగా సూచించింది.