పెద్దపల్లి, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆదివారం కొవిడ్ స్వల్ప లక్షణాలతో హైదరాబాద్లోని యశోద దవాఖానలో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలింది. దీంతో ఆయన యశోదలోని ఐసోలేషన్లో ఉన్నారు. ఈ రోజు వరకు తనను కలిసిన వారందరూ కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని మంత్రి కోరారు.